Gold Movie OTT Rights | మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ఇండియాలోనే ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు. ప్రతి ఏడాది ఐదారు సినిమాలను చేస్తూ షూటింగ్లలో బిజీగా గడపుతుంటాడు. కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకుడిగా పలు విభాగాల్లో పనిచేస్తూ మాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన కడువ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం పృథ్విరాజ్ గోల్డ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రేమమ్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆల్ఫోన్స్ పుత్రేన్ దాదాపు ఏడేళ్ళ తర్వాత ఈ మూవీని తెరకెక్కించాడు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓనమ్ పండుగ సందర్భంగా సెప్టెంబర్ 8న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్గా మారింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. కాగా ఈ సినిమా హక్కలను అమెజాన్ భారీ ధరకు కొనుగోలు చేసిందట. మలయాళం,తమిళ భాషలకు కలుపుకొని దాదాపు 50కోట్లకు పైగానే చెల్లించినట్లు వార్తలు వస్తున్నారు. ఇక పృథ్విరాజ్ సినిమాలుకున్న క్రేజ్తో ఇంత మొత్తంలో అమెజాన్ డిజిటల్ హక్కలను కొనుగోలు చేసిందని టాక్. ఇక ఈ చిత్రంలో పృథ్విరాజ్కు జోడీగా నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై సుప్రియా మీనన్, లిజిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మించారు.