Dhanush | కుబేర, ఇండ్లీ కడై సినిమాలతో బిజీగా ఉన్నారు ధనుష్. మరోవైపు ఆయన కథానాయకుడిగా ఇళయరాజా బయోపిక్ కూడా తెరకెక్కనుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. ఇదిలావుంటే.. అనుకోకుండా ధనుష్ డైరీలో ఓ కొత్త సినిమా వచ్చి చేరింది. ఇది కూడా బయోపిక్కేనని తెలుస్తున్నది. ‘అమరన్’ దర్శకుడు రాజ్కుమార్ పెరియస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని చెన్నై సమాచారం. నిజానికి రాజ్కుమార్ ఓ బాలీవుడ్ సినిమాను ఇటీవలే ప్రకటించాడు.
అయితే.. ఆ సినిమాకంటే ముందే ధనుష్తో సినిమా ఉంటుందని తెలుస్తున్నది. ఈ సినిమా కథ విషయంలో రకరకాల కథనాలు సోషల్మీడియాలో వెలువడుతున్నాయి. మనదేశంలో చాలామంది రియల్లైఫ్ హీరోలున్నారని, వారి కథలతో సినిమాలు తీస్తే అద్భుతాలు సృష్టించొచ్చని గతంలో రాజ్కుమార్ పెరియస్వామి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. దానికి తగ్గట్టే ధనుష్తో ఆయన చేయబోతున్న సినిమా కూడా రియల్లైఫ్ స్టోరీనే అని తెలుస్తున్నది. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా ఎంపికైందట. మిగతా వివరాలు తెలియాల్సివుంది.