తెలుగు చిత్ర పరిశ్రమలో నవ్వుల పూలు పూయించిన వ్యక్తి అల్లు రామలింగయ్య. తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య హాస్యం ఏ తీరున ప్రత్యేకమైనదో, అదే విధంగా ఆయన సాగిన వైనం కూడా వైవిధ్యాన్ని సంతరించుకుంది. అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు. బాల్యం నుంచీ తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచుతూ సాగారు. 1970లలో రూపొందిన వందలాది చిత్రాలలో అల్లు రామలింగయ్య నవ్వులు పూయిస్తూ సాగారు. ఒకే రోజున నాలుగు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి నవ్వులు పండించేవారు.
రేలంగి తరువాత ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న హాస్యనటులుగా చరిత్రలో నిలిచారు. ఇక ఆయన కీర్తి కిరీటంలో పలు అవార్డులూ, రివార్డులూ చోటు చేసుకున్నాయి. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు సైతం అందుకున్నారు.2004 జూలై 31న అల్లు రామలింగయ్య తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా అభిమానులు నివాళులు అర్పిస్తూ జయంత్యుత్సవాలు జరుపుతున్నారు. అక అల్లు రామలింగయ్య మనవళ్లు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ అల్లు స్టూడియోలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి దాంతో ఫొటో దిగారు. ఈ పిక్ వైరల్గా మారింది.