స్టైలిష్ట్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా మారిన అల్లు అర్జున్ తాజాగా పుష్ప చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 17న విడుదల కానున్న ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్ర మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ అనే టైటిల్తో ఈనెల 17న విడుదల చేయనున్నారు. రీసెంట్గా ట్రైలర్ విడుదల చేయగా, ఇందులో బన్నీ తన నట విశ్వరూపం చూపించారు. పూర్తిగా లారీ డ్రైవర్గా ఊర మాస్ పాత్రలో ఇరగదీశాడు. యాక్షన్ సన్నివేశాలతో తగ్గేదేలే అన్నట్టుగా ఉంది పుష్ప ట్రైలర్. ఈ ట్రైలర్పై అభిమానులే కాక పలువురు సెలబ్స్ కూడా ప్రశంసలు కురిపించారు.
అయితే ఈ సినిమా కోసం సమంత ఐటెం భామ అవతారం ఎత్తింది. సోమవారంతో ఈ పాట షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుంది. పాట షూటింగ్ని ఇంత త్వరగా పూర్తి చేసినందుకు ఫుల్గా ఇంప్రెస్ అయిన బన్నీ 12మంది సిబ్బందికి ఒక తులం (10 గ్రాములు) విలువైన బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారట. ఇందులో అసిస్టెంట్, ఆర్ట్ డైరెక్టర్లు మరియు ఇతర సిబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో అల్లు అర్జున్, సమంతలపై ఈ పాటను చిత్రీకరించారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అనసూయ, సునీల్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు