Allu Arjun | పుష్ప.. ది రైజ్ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సినిమా ఇచ్చిన క్రేజ్తో ఐకాన్ స్టార్గా మారిపోయాడు. అయితే అల్లు అర్జున్కి హీరోగా అభిమానుల్లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో… ఆయన భార్య స్నేహా రెడ్డి (Sneha Reddy)కి సైతం సోషల్ మీడియాలో అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో స్నేహా రెడ్డి పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక వీరిద్దరూ.. ఓ వైపు ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో తీరిక లేకుండా ఉంటునే సమయం దొరికితే వెకేషన్కు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు .
తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డితో కలిసి ప్యారిస్ వెకేషన్కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్నేహారెడ్డి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇక ఈ పోస్టుకు ప్యారిస్ స్వర్గం కంటే కేవలం మూడు అక్షరాలు తక్కువగా ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోల్లో అల్లు అర్జున్ బ్లాక్ టీ షర్ట్, మ్యాచింగ్ జాకెట్, బ్లాక్ జీన్స్ ధరించగా.. స్నేహారెడ్డిబ్రౌన్ టాప్, బ్లాక్ ట్రౌజర్, బ్లాక్ జాకెట్లో ఫొజులు ఇచ్చింది.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప.. ది రూల్ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. యాక్షన్ ఎంటర్టైనర్గా సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న సీక్వెల్ పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.