12ఏండ్ల క్రితం విడుదలైన అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. సురేందర్రెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న (నేడు) అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. క్రౌన్ మూవీస్ ఈ చిత్రాన్ని రెండు తెలుగురాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, డా.వెంకటేశ్వరరావు, నటులు, అలీ, రఘుబాబు, పంపిణీదారులు నారాయణరావు, సుబ్బారావు హాజరయ్యారు.
ఈ సినిమా మరోమారు థియేటర్లలో తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆహుతులంతా ఆశాభావం వెలిబుచ్చారు. శృతిహాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కిక్ శ్యామ్, సలోని, బ్రహ్మానందం, ప్రకాశ్రాజ్, రవికిషన్, శామ్ కీలకపాత్రధారులు. ఈచిత్రానికి సంగీతం: ఎస్.థమన్.