Allu Arjun | పుష్ప2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రం రాబోతుందని చాలా మంది అనుకున్నారు. కాని అట్లీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీ హాలీవుడ్ రేంజ్లో రూపొందుతుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడు అనే దానిపై ఇప్పటి నుండే చర్చ నడుస్తుంది. అట్లీతో సినిమా తర్వాత అయినా త్రివిక్రమ్తో బన్నీ సినిమా చేస్తాడేమో అన్న ఊహాగానాలకు బ్రేక్ వేసేలా, గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే నెక్ట్స్ బిగ్ అనౌన్స్మెంట్పై బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చాడు.
రీసెంట్గా బన్నీ వాసు త్రివిక్రమ్ సినిమా కాదు, ఊహించని కాంబినేషన్ అంటూ ట్వీట్ చేసాడు. దాంతో అభిమానుల్లో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఉత్సుకత పెరిగిపోయింది. ఎవరా అని ఆరా తీస్తే మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ పేరు వినిపిస్తుంది. ఆయనతోనే బన్నీ నెక్ట్స్ అంటున్నారు. బాసిల్ జోసెఫ్ పేరు వినగానే సినీ ప్రియులకు గుర్తొచ్చేది ‘మిన్నల్ మురళీ’. 2021లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ చిత్రం బాసిల్కు విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. అదే సమయంలో ‘జయ జయ జయ జయహే’ లాంటి సెటైరికల్ కామెడీ హిట్తో కూడా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.
ఇప్పుడు బాసిల్ – బన్నీ కాంబో ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తుండటంతో, ఇది మలయాళ-తెలుగు సినీ ప్రపంచానికి వారధిగా మారే ప్రాజెక్ట్ అవుతుందా? అనే చర్చ మొదలైంది. అల్లు అర్జున్కి కేరళలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు లేదు. అక్కడ ఆయనకు ‘మల్లు అర్జున్’ అన్న బిరుదే ఉంది. ఇలాంటి బన్నీ.. మలయాళ ఇండస్ట్రీ క్రియేటివ్ డైరెక్టర్తో సినిమా చేయనున్నాడంటే, కేరళ ఆడియన్స్కి పండగే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ దశలో ఉందట. వచ్చే నాలుగు నెలల్లో గీతా ఆర్ట్స్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కాంబినేషన్ నిజంగా లాక్ అయిందా, లేదా ఇంకో సర్ప్రైజ్ ఉన్నదా అన్నదే ఆసక్తికర అంశం.