ప్రస్తుతం మల్టీ స్టారర్ హంగామా నడుస్తుంది. ఇండస్ట్రీకి చెందిన పెద్ద హీరోలు కూడా మల్టీ స్టారర్ చిత్రాలలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీ స్టారర్ చిత్రం రూపొందగా, ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు బన్నీ ఓ బాలీవుడ్ స్టార్తో కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
జెర్సీ హిందీ ట్రైలర్ లాంచ్ రీసెంట్గా జరగగా, ఈ కార్యక్రమానికి ప్రధాన తారలు షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్, మీడియా, ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ ని బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తో పాన్ ఇండియా మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారా? అని మీడియా ప్రశ్నించింది.
వారి ప్రశ్నలకు సమాధానంగా ఇప్పుడు అది చెప్పే సమయం కాదు, సరైన స్థలంలో దాని గురించి చెబుతాను అని అన్నాడు. దీంతో ‘జెర్సీ’ హీరో షాహిద్ కపూర్, అల్లు అర్జున్ తో కలిసి అరవింద్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమాను డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.