Allu Arjun | ప్రముఖ నటుడు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కీలక సూచన చేశారు. తన ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని సూచించారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ఫేక్ ప్రొఫైల్స్తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా వుండాలని నా ఫ్యాన్స్కు సూచించారు. సంధ్య థియేటర్ వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్పై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
థియేటర్లో ఒక తల్లి చనిపోయినా మానవత్వం లేకుండా రూఫ్టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయాడని విమర్శించారు. అయితే, పోలీసుల అనుమతి లేకుండానే థియేటర్కు వెళ్లి, రోడ్షో, ర్యాలీ నిర్వహించినట్లు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని అల్లు అర్జున్ స్పష్టంచేశారు. అయితే, తనపై వస్తున్న విమర్శలపై అల్లు అర్జున్ తోసిపుచ్చారు. తొక్కిసలాట ఘటనలో తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని.. బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని, చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తన ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం జరుగుతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
I appeal to all my fans to express their feelings responsibly, as always and not resort to any kind of abusive language or behavior both online and offline. #TeamAA pic.twitter.com/qIocw4uCfk
— Allu Arjun (@alluarjun) December 22, 2024