హైదరాబాద్ అమీర్పేట్లోని ‘ఏఏఏ సినిమాస్’ను గురువారం అగ్ర హీరో అల్లు అర్జున్ ప్రారంభించారు. ఏషియన్ సినిమాస్తో కలసి అల్లు అర్జున్ ఈ మల్టీఫ్లెక్స్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. నిర్మాత అల్లు అరవింద్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ ‘ఈ కాంప్లెక్స్ నాలుగో అంతస్తులో ఐదు స్క్రీన్లు ఉన్నాయి. స్క్రీన్ నెం.2లో ఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. దక్షిణాదిలో ఎల్ఈడీ స్క్రీన్ ఉన్న ఒకే ఒక్క థియేటర్ ఇది. ప్రేక్షకులకు సరికొత్త వీక్షనానుభూతినందిస్తుంది. ఇక అతిపెద్ద తెరతో స్క్రీన్-1ను రూపొందించాం’ అని అన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ థియేటర్ల సముదాయాన్ని తీర్చిదిద్దారని అల్లు అరవింద్ పేర్కొన్నారు.