Allu Arjun | అగ్ర హీరో అల్లు అర్జున్ సోషల్మీడియాలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో అయన్ని అనుసరించే అభిమానుల సంఖ్య 25 మిలియన్లకు చేరింది. ఈ స్థాయి ఫాలోయింగ్ను సంపాదించుకున్న తొలి దక్షిణాది నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారాయన. ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా ఉత్తరాది మాస్ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.
ఈ సినిమాలోని నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుపొందడంతో బన్నీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. దీంతో సోషల్మీడియాలో ఆయన అభిమానగణం కూడా పెరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప-2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్..త్రివిక్రమ్ లేదా అట్లీ దర్శకత్వం సినిమా చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఆయన ఓ సినిమాకు అంగీకరించారు.