Allu Arjun | సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు పీఎస్లో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్ విచారణకు హాజరుకావడానికి జూబ్లీహిల్స్లోని రోడ్ నంబర్ 60లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్తో పాటు అతడి మామ చంద్రశేఖర్, ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ బన్నీ వెంట స్టేషన్కు వెళ్లారు. మరోవైపు అల్లు అర్జున్ రాకతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పీఎస్ నుంచి 200 మీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు.. వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో ఆధారంగానే అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇటీవల ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మీదా కూడా విచారించే వీలుంది. దాదాపు రెండు గంటల పాటు ఈ విచారణ జరగబోతుండగా.. ఏసీపీ రమేష్ కుమార్తో పాటు సెంట్రల్ జోన్ డిసీపీలు అల్లు అర్జున్ను విచారించనున్నారు.
#WATCH | Telangana: Actor Allu Arjun reaches Chikkadpally police station in Hyderabad to appear before the police in connection with Sandhya theatre incident. pic.twitter.com/5ldY8z20Xu
— ANI (@ANI) December 24, 2024