Allu Arjun | నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్గా ఇటీవలే టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచాడు అల్లు అర్జున్ (Allu Arjun) . పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేయడమే కాదు.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ స్టార్ హీరో ఖాతాలో అత్యంత అరుదైన ఫీట్ చేరుకుంది. దుబాయ్లోని మడమే టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం (wax statue) కొలువుదీరనుంది.
ఈ మేరకు మ్యూజియం ప్రతినిధులు అల్లు అర్జున్ కొలతలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజా టాక్ ప్రకారం అల్లు అర్జున్కు సంబంధించి సుమారు 200కుపైగా (ముఖం, బాడీ) కొలతలు తీసుకున్నారట. ఈ ఏడాది తర్వాత మైనపు విగ్రహాన్ని లాంఛ్ చేయనున్నారు. చిన్నప్పుడు ఈ మ్యూజియాన్ని సందర్శించానని, తన విగ్రహమే ఇక్కడ ఏర్పాటు చేస్తారని ఎప్పుడూ అనుకోలేదని తన ఎక్జయిట్మెంట్ను అందరితో షేర్ చేసుకున్నాడు బన్నీ. ఈ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటు చేసుకోబోతున్న తొలి తెలుగు హీరోగా అత్యంత అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు బన్నీ.
అల్లు అర్జున్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 2021కి గాను ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల (69th National Film Awards)ల్లో పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడని తెలిసిందే. 69 ఏండ్లలో ఇప్పటివరకు తెలుగు హీరోలెవరూ సాధించని అరుదైన రికార్డును నెలకొల్పాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).
వీడియో ట్రెండింగ్..
#AlluArjun at Madame Tussauds!#alluarjun pic.twitter.com/4cBbDslHsw
— 𝙄𝘾𝙊𝙉 🌟 𝙆𝙍𝙄𝙎𝙃𝙉𝘼 😎 (@krishnaAAARMY) October 5, 2023
#AlluArjun to get wax figure at Madame Tussauds in Dubai, see photos@alluarjun https://t.co/9r0Q8CoYsM
— BollyHungama (@Bollyhungama) October 6, 2023