అల్లరి నరేష్ అంటే కడుపుబ్బా నవ్వించే కామెడీ పాత్రలు మాత్రమే కాదు..కన్నీళ్లు పెట్టించే సీరియస్ క్యారెక్టర్స్ కూడా గుర్తుకొస్తాయి. విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యం, నాంది ఆయన నటనలోని మరో పార్శాన్ని ఆవిష్కరించాయి. నరేష్ నటిస్తున్న మరో విభిన్న కథా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండు నిర్మాత. మంగళవారం సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇందులో నరేష్ మంచాన్ని మోస్తూ కనిపిస్తున్నారు. తలకు, చేతికి గాయాలతో ఆయన లుక్ సీరియస్గా ఉంది. ‘మారేడుమిల్లి అనే గ్రామంలో జరిగే కథ ఇది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్రెడ్డి, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, హాస్యమూవీస్.