బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘రక్షాబంధన్’ చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సినిమా గురించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు అక్షయ్కుమార్. తన వ్యక్తిత్వాన్ని మార్చివేసిన సినిమా ఇదని ప్రశంసించారు. ‘ఇప్పుడు నేను ఓ పరిపూర్ణమైన, ఉన్నత వ్యక్తిత్వాన్ని సముపార్జించుకున్న నటుడిగా మారానని భావిస్తున్నా. ప్రతి ఒక్కరి హృదయాల్ని స్పృశించే కథ ఇది’ అని అక్షయ్కుమార్ పేర్కొన్నారు. కుటుంబ అనుబంధాలు ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. భూమి పెడ్నేకర్ కథానాయిక. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రేక్షకులముందుకు రానుంది.