గత కొన్నేళ్లుగా సినిమాల ఎంపికలో నిదానంగా అడుగులు వేస్తోన్న అఖిల్ ప్రస్తుతం వేగాన్ని పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఏజెంట్’ సినిమా కోసం సన్నద్ధమవుతోన్న ఆయన తాజాగా మరో సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.