కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసిన చిత్రం అఖండ. ‘సింహా’, ‘లెజెండ్’తర్వాత బాలకృష్ణ- బోయపాటి శీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం భారీ విజయం సాధించడంతో ఈ కాంబోలో హ్యాట్రిక్ నమోదైంది. చిత్రంలో బాలకృష్ణ గ్రామ పెద్ద మురళీ కృష్ణగా, అఖండగా రెండు విభిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ‘జైబాలయ్య’పాటకు ఆయన వేసిన స్టెప్పులు, అఖండ రూపంలో చేసే ఫైట్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి.
చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ మూవీకి సీక్వెల్ చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమా క్లైమాక్స్లో ‘ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఆ లోకమాతే నాకు తల్లి’ అంటూ అఖండ తన బంధాలన్నింటినీ తెంచేసుకుని వెళ్లిపోతాడు. కానీ.. వెళ్లే ముందు మాత్రం సినిమాలో కీలక పాత్ర అయిన మరో బాలకృష్ణ కూతురికి మాట ఇస్తాడు. ‘నీకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను’ అని చెప్తాడు.
ఇప్పుడు ఆ పాయింట్ ఆధారంగా సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట. పాపకు మరో సమస్య తలెత్తడం,అఖండ తిరిగి రావడం జరుగుతుందని టాక్. సినిమా ప్రారంభంలో పసిగుడ్డుగా ఉండగానే కాశీకి చేరతాడు బాలకృష్ణ. మరి అక్కడ ఎవరి దగ్గర, ఎలా పెరిగాడు? వంటి అంశాలను సీక్వెల్లో చూపించే అవకాశం ఉందంటున్నారు. అఖండ చిత్రంలో బాలయ్య కర్తవ్యం పాడు బడిన గుడులను బాగుచేయడం.ఆ ఆలయాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడం. మరి ఈ క్రమంలో అతడికి ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? అందుకే చెడ్డ అఘోరాలను చంపాడా? ఇవి కూడా సీక్వెల్లో చూపించొచ్చని లెక్కలు వేస్తున్నారు.