టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయి అంతకంత పెరుగుతూ పోతుంది. మన దర్శకులు బ్లాక్ బస్టర్స్ తీస్తుండడంతో మన వారితో సినిమాలు చేసేందుకు తమిళం,మలయాళం, హిందీ పరిశ్రమలకు సంబంధించిన హీరోలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ములతో ధనుష్ ఓ సినిమా ప్లాన్ చేయగా, ఇప్పుడు ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరిని దృష్టిని ఆకర్షించిన అజయ్ భూపతితో కలిసి ధనుష్ ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అజయ్ భూపతి ‘మహా సముద్రం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శర్వానంద్,సిద్దార్థ్ , అదితిరావు హైదరీ, అనూ ఇమ్మానియేల్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రాన్ని చేస్తున్నారు.ఈ చిత్రం తర్వాత ధనుష్తో ఓ మూవీ అజయ్ చేయనున్నాడట. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా రేంజ్లో ఉండనుందని అంటున్నారు.ఇప్పటికే ధనుష్- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషలలో పాన్ ఇండియన్ రేంజ్లో దీనిని తెరకెక్కించనున్నారు.