హీరో సాయితేజ్ నటిస్తున్న నూతన చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విక్రాంత్ రోణ, కాంతారా చిత్రాలకు సంగీతం అందించిన ఆయన ఇప్పుడు సాయితేజ్ నటిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్కు స్వరాలను, నేపథ్య సంగీతాన్ని అందించబోతున్నాడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సుకుమార్ వద్ద రచన విభాగంలో పనిచేసిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సంయుక్త మీనన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యామ్దత్, ఎడిటర్: నవీన్ నూలి.