Aishwarya Rajinikanth Hospitalized | సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య మళ్లీ ఆస్పత్రిలో చేరింది. ఇటీవల కరోనాతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఐశ్వర్య.. తాజాగా మరోసారి అస్వస్థతకు గురైంది. వర్టిగో, జ్వరంతో ఆమె ఆస్పత్రిలో జాయిన్ అయింది. ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది.
ఆ మధ్య ఐశ్వర్య రజినీకాంత్కు కరోనా వచ్చింది. అయితే కొవిడ్-19 సోకిన తర్వాత శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రజినీకాంత్. జీవితం కరోనాకు ముందు తర్వాత అన్నట్లు తయారైంది అంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయం పంచుకుంది ఐశ్వర్య. వర్టిగో, జ్వరంతో ఈమె హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆస్పత్రిలో డాక్టర్తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ‘జీవితం కరోనాకు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా ఉంది. వైరస్ వచ్చి వెళ్లిన తర్వాత ఆరోగ్యం దెబ్బ తింటుంది. జ్వరం, వర్టిగోతో మరోసారి ఆసుపత్రిలో చేరాను. కానీ ఇలాంటి సమయంలో ఓ స్ఫూర్తినిచ్చే డాక్టర్ మన పక్కన ఉంటే ఈ బాధ ఎక్కువగా ఉండదు. ఈ ఉమెన్స్ డేని ఇంత మంచి వాళ్లతో మొదలు పెట్టినందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యు మేడం’ అంటూ డాక్టర్ గురించి పోస్ట్ చేసింది ఐశ్వర్య.
ఈమెకు త్వరగా నయం కావాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మధ్యే ధనుష్తో తన 18 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికింది ఐశ్వర్య. అయితే ఆయనతో విడిపోయినా కూడా ఐశ్వర్య తన పేరులో నుంచి ఇంకా ధనుష్ పేరును మాత్రం తొలగించలేదు. ఇప్పటికీ ఆమె ఇన్స్టాగ్రామ్ పేరు ఐశ్వర్య ఆర్ ధనుష్ అనే ఉంది.