కుటుంబ బాధ్యతల వల్ల మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్ తమిళ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’తో వెండితెరపై పునరాగమనం చేస్తోంది. తమిళ చారిత్రక నవల ఆధారంగా విలక్షణ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేయబోతున్నది. తాజాగా ఐశ్వర్యరాయ్ ఓ ఇండో అమెరికన్ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘త్రీ ఉమెన్’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఇషితా గంగూలీ దర్శకురాలిగా పరిచయమవుతోంది. అలనాటి రచనను నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్చుతూ తల్లీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. ఇందులో ఘోస్ట్ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించనుందని చెబుతున్నారు. ఐశ్వర్యరాయ్ సలహా మేరకు ఈ సినిమాను ఇంగ్లీష్లో తెరకెక్కించబోతున్నట్లు దర్శకురాలు తెలిపారు. దాదాపు పన్నెండేళ్ల విరామం తర్వాత ఆమె నటిస్తున్న ఆంగ్ల చిత్రమిది.