Allari Naresh59 Itlu Maredumilli Prajaneekam | నవరసాల్లో నవ్వించడం చాలా కష్టం అంటారు. కామెడీ చేసిన వాళ్లు ఏ క్యారెక్టర్ అయినా ఈజీగా చేస్తారని చెప్తుంటారు. ఇప్పుడు అల్లరి నరేశ్ ఇదే చేస్తున్నాడు. నరేశ్ అంటే ముందుగా గుర్తొచ్చేది కామెడీ. తెలుగులో రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీలో హీరోగా నిలబడింది నరేశ్ ఒక్కడే. మధ్యలో చాలా మంది ట్రై చేసినా కూడా కుదర్లేదు. కానీ అల్లరి నరేశ్ మాత్రం తొలి సినిమా నుంచే తనదైన మార్క్ సొంతం చేసుకున్నాడు. అప్పట్నుంచి చాలా తక్కువ గ్యాప్లోనే 50 సినిమాలు కూడా పూర్తి చేశాడు. అందులో ఎన్ని విజయాలు ఉన్నాయనేది పక్కనబెడితే కామెడీలో మాత్రం కుమ్మేశాడు నరేష్. తనదైన బ్రాండ్ సృష్టించుకున్నాడు.
సుడిగాడుతో పీక్స్ చూశాడు. కానీ ఓ రకమైన మొనాటినీ వచ్చేయడంతో కామెడీ సినిమాలను చూడటం మానేశారు ఆడియన్స్. నరేశ్ సినిమా వస్తుందంటే.. ఆ వచ్చి పోతుందిలే అనే స్టేజీకి వచ్చేసింది వ్యవహారం. అన్నీ ట్రై చేసినా విజయం మాత్రం వర్కవుట్ కావడం లేదు. దాంతో గ్యాప్ తీసుకుని పూర్తిగా తనను తాను మార్చుకుని నాంది సినిమా చేశాడు నరేశ్. ఆ సినిమా మంచి విజయం సాధించింది. నాంది తర్వాత ఏ మాత్రం తొందర పడకుండా గ్యాప్ తీసుకుని ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం అంటూ మరో సీరియస్ సినిమాతో వస్తున్నాడు.
పైగా తనను నటుడిగా ప్రాణం, నేను, గమ్యం, శంభో శివ శంబో, నాంది లాంటి సినిమాలు చేసినపుడే బాగా గుర్తిస్తున్నారని అప్పట్లో చెప్పాడు నరేష్. అందుకే ఇప్పట్నుంచి క్వాంటిటీ కాదు కంటెంట్ క్వాలిటీ చూసుకుంటానని చెప్పాడు నరేశ్. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. నరేశ్ కామెడీ కాకుండా సీరియస్ పాత్రలు చేస్తే చూడాలని చాలా రోజులుగా ఎంతో మంది అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల కోరిక తీరబోతుంది. ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం ( Itlu Maredumilli Prajaneekam ) సినిమాను రాజేశ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మొత్తానికి చూడాలిక నరేష్ సీరియస్ జర్నీ ఎలా ఉండబోతుందో..!