అగ్ర కథానాయిక సమంతలో మునుపటి ఉత్సాహం కనిపిస్తున్నది. మయోసైటిస్ అనే కండరాల వ్యాధి నుంచి కోలుకుంటున్న ఆమె తిరిగి కెమెరా ముందుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. సోషల్మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన సినిమాల తాలూకు విశేషాల్ని పంచుకుంటున్నది. తాజాగా తాను టైటిల్ రోల్ని పోషించిన ‘శాకుంతలం’ చిత్రంలో పాత్రపరంగా కొన్ని కష్టమైన అంశాల్ని వివరిస్తూ సోషల్మీడియాలో ఓ పోస్ట్ చేసింది. “శాకుంతలం’ చిత్రం నా కెరీర్లో చాలా ప్రత్యేకం. వివిధ సందర్భాలు, సన్నివేశాల్లో ముఖంలో ఒకేరకమైన భావోద్వేగాల్ని పలికించడం చాలా కష్టమనిపించేది. నడకలో, పరుగులో…అఖరికి ఏడుస్తున్నప్పుడు కూడా ఒకే విధమైన ఎక్స్ప్రెషన్తో కనిపించడం అంత సులభం కాదు. ఓ సవాలుగా తీసుకొని నా పాత్రకు న్యాయం చేశా. అలాగే కొన్ని సందర్భాల్లో ఒకే భంగిమను కొనసాగించడం కూడా కష్టమనిపించేది. అయితే ఈ అంశాల్లో ప్రావీణ్యం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా’ అని సమంత తన పోస్ట్లో పేర్కొంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత పౌరాణిక నాయిక శకుంతల పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకురానుంది.