అడివిశేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకుడు. మహేష్బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల కథానాయికలు. లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణను జూలైలో పునఃప్రారంభించబోతున్నట్లు అడివి శేష్ శనివారం ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు సినిమా తాలూకు వర్కింగ్స్టిల్ను అభిమానులతో పంచుకున్నారు. అడివి శేష్ మాట్లాడుతూ ‘గత ఏడాది హిమాచల్ప్రదేశ్లోని చిట్కుల్లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఆ ప్రాంత విజువల్స్, అక్కడివారితో జ్ఞాపకాలు మరువలేనివి. తొంభై శాతం చిత్రీకరణ పూర్తయింది. బ్యాలెన్స్ షూటింగ్ను జూలైలో తిరిగి మొదలుపెట్టబోతున్నాం. ముంబయి ఉగ్రదాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది’ అని తెలిపారు. ప్రకాష్రాజ్, రేవతి, మురళీశర్మ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.