ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(om raut) ఈ చిత్రాన్ని పౌరాణిక నేపథ్యంలో రూపొందిస్తున్నారు. చిత్రంలో ప్రభాస్(Prabhas) రాముడిగా కనిపించనుండగా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. రెట్రోఫిల్స్తో కలిసి సంగీత దిగ్గజం టి-సిరీస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.
గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆదిపురుష్ చిత్ర షూటింగ్ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ మరొకొన్ని వారాల్లోనే పూర్తి కానుంది. ఇప్పటికే కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ పార్ట్ షూటింగ్ పూర్తైంది. ఈ చిత్రానికి “బాహుబలి” సిరీస్ కంటే ట్రిపుల్ వీఎఫ్ఎక్స్ ఉంటుందని సమాచారం.
భారీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ తో 3డిలో తెరకెక్కుతున్న “ఆదిపురుష్” (Adipurush) పోస్ట్-ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించే ముందు దర్శకుడు ఓం రౌత్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. గత వారం ప్రభాస్ కు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడం ప్రారంభించారు మేకర్స్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2022 ఆగస్ట్ 8న విడుదల కానుంది. ఈ డేట్ గతంలో ప్రకటించగా, ఫ్యూచర్లో మార్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.