వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ప్రభాస్ ఇప్పటికే రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఇప్పుడు ఆయన నటిస్తున్న సలార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఇందులో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఆదిపురుష్ చిత్ర షూటింగ్కి కరోనా బ్రేక్లు వేయగా, ఈ చిత్ర రిలీజ్ పై అభిమానులలో గందరగోళం ఏర్పడింది. దీంతో మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ ఒకటి తాజాగా విడుదల చేసి పుకార్లుకు పులిస్టాప్ వేశారు.వచ్చే ఏడాది ఆగస్ట్ 11న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలియజేశారు.
3డీ ఫార్మాట్లో సినిమాని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 9 వరకు 26 రోజులు సాగే ఈ లాంగ్ షెడ్యూల్ లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను తెరకెకెక్కించనున్నారట. నవంబర్ లోపు చిత్రీకరణ పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారని తెలుస్తుంది.