‘గత సినిమాల విషయంలో కథలు బాగున్నా వాటిని తెరపై ఆవిష్కరించడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పరాజయాలు ఎదుర్కొన్నా. సరైన రిలీజ్ డేట్ దొరకడం ముఖ్యమని అర్థంచేసుకున్నా. భవిష్యత్తులో ఆ తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్తపడుతున్నా’ అని అన్నారు ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘అతిథిదేవోభవ’. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు. రాజబాబు మిర్యాల, అశోక్రెడ్డి మిర్యాల నిర్మించారు. ఈ నెల 7న విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్లో ఆది సాయికుమార్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
ఒంటరితనాన్ని చూసి భయపడే ఓ యువకుడి కథ ఇది. తనకున్న ఫోబియా నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? అతిథిని దేవుడిగా భావించే ఆ యువకుడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. కుటుంబ విలువలతో పాటు చక్కటి వినోదాన్ని పంచుతుంది. అంతర్లీనంగా వచ్చే తల్లీకొడుకుల అనుబంధం ఆకట్టుకుంటుంది. నా పాత్రచిత్రణ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. హీరోయిజం హంగులు లేకుండా చాలా సెటిల్డ్గా కనిపిస్తా. ఒక్క రోజులో జరిగే కథ ఇది. స్క్రీన్ప్లే కొత్తగా ఉంటుంది. మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాపడటంతో ఆ రోజునే మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం.
ట్విట్టర్ వాడను
ప్రస్తుతం నా మనసుకు నచ్చే అంశాలున్న వర్కవుట్ అవుతుందనే నమ్మకం కలిగిన నవ్యమైన కథలను ఎంచుకుంటున్నా. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘తీస్మార్ఖాన్’, ‘బ్లాక్’ సినిమాల షూటింగ్ పూర్తయింది. అమరన్ ఇన్ ద సిటీ, సీఎస్ఐ సనతాన్ షూటింగ్లు జరుగుతున్నాయి. ‘జంగిల్’ పేరుతో ద్విభాషా సినిమా చేయబోతున్నా. ‘ఫన్నీ కృష్ణ’ సంక్రాంతి రోజున ప్రారంభంకానుంది. భవిష్యత్తులో మంచి కథలు దొరికితే డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి అడుగుపెడతా. సోషల్మీడియాలో నేను యాక్టివ్గా ఉండను. ట్విట్టర్ వాడను.