ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో కేజీఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్నీల్-కన్నడ నటుడు యశ్ కాంబోలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’కు సీక్వెల్గా ఈ సినిమా రానుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా సిద్ధమైన ‘కేజీఎఫ్-2’లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా ‘అధీరా’ పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల కాగా, ఇది ఎంతగానో ఆకట్టుకుంది.
తాజాగా అధీరా తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులు మొదలు పెట్టాడు. సంజయ్ దత్ డబ్బింగ్ చెబుతున్న పోస్టర్ విడుదల చేస్తూ, సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. కాగా, ఆ మధ్య విడుదలైన అధీరా లుక్లో సంజయ్ దత్ చేతిలో భారీ ఖడ్గం పట్టుకొని మహా పవర్ఫుల్గా కనిపించాడు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కీలక పాత్ర పోషించారు.