రామ్తేజ్, రేఖ ఇందుకూరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అడవి దొంగ’. కిరణ్ కోటప్రోలు దర్శకుడు. గోపీకృష్ణ నిర్మాత. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను గురువారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అన్ని రకాల వాణిజ్య హంగులతో వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ‘కొత్త కథతో టీమ్ అంతా కష్టపడి సినిమా కోసం పనిచేశాం. ప్రతి సన్నివేశం సహజంగా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు రోమాంచితంగా అనిపిస్తాయి’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్.ఎస్.కిరణ్కుమార్, సంగీతం: వినోద్ యాజమాన్య, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కిరణ్ కోటప్రోలు.