న్యూఢిల్లీ: మెట్లపై నుంచి పడి ఓ యువ నటి దుర్మరణం పాలయ్యింది. అంతకుముందు మెట్లపై పడిపోయి తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా తెలిపారు. మెదడు మాత్రమే డెడ్ అయిందని, గుండె సహా ఆమె మిగతా అవయవాలన్నీ పనిచేస్తున్నాయని వైద్యులు స్పష్టంచేశారు.
ఉత్తర కొరియాకు చెందిన పార్క్ సూ ర్యూన్ (29) 2018లో సినీరంగ ప్రవేశం చేసింది. అక్కడి సినిమా రంగంలో ఆమె ఇప్పుడిప్పుడే తనదైన ముద్ర వేస్తున్నది. ఈ క్రమంలో గత శనివారం పని నిమిత్తం బయటికి వెళ్లిన పార్క్ ఇంటికి వస్తూ మెట్లపై నుంచి పడిపోయింది. తల మెట్టుకు బలంగా తాకడంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్ డెడ్గా తేల్చారు. అక్కడి ఓ ట్రస్టు సలహా మేరకు ఆమె కుటుంబసభ్యులు పార్క్ అవయవాలను దానం చేశారు.