దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందిస్తున్న ‘వ్యాక్సిన్ వార్’ షూటింగ్లో నటి పల్లవి జోషి ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో ఉపయోగిస్తున్న ఓ కారు అదుపుతప్పి ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పల్లవికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో మన సైంటిస్టులు ఎదుర్కొన్న పరిస్థితులను నేపథ్యంగా ఎంచుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తనకు గాయమైనా పల్లవి జోషి చిత్రీకరణలో పాల్గొందని, ఆమెకు చికిత్స అందించడం కోసం ఆస్పత్రిలో చేర్పించామని నిర్మాత అభిషేక్ అగర్వాల్ వెల్లడించారు.