అగ్ర కథానాయిక నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ మధ్య ప్రేమాయణం గత ఆరేళ్లుగా నిర్విఘ్నంగా సాగుతున్నది. ఈ జంట పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విఘ్నేష్తో తన నిశ్చితార్థం అయిపోయిందని, సరైన సమయంలో పెళ్లి చేసుకుంటామని ఏడాది క్రితం చెప్పింది నయనతార. అయితే ఈ దర్శకనాయికా జోడీ అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారని..ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారనే పుకార్లు వినిపించాయి. తాజాగా వీటిని బలపరిచే వీడియో ఒకటి బయటికొచ్చింది. ఇటీవల చెన్నైలోని ఓ దేవాలయ దర్శనానికి వెళ్లిన ఈ జంట అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభిమానులతో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలో నయనతార నుదిటిపై, పాపిట మధ్యన సింధూరం ధరించి కనిపించింది. ముఖ్యంగా వివాహానికి సంకేతంలా పాపిట నడుమ సింధూరం ధరించి కనిపించడంతో ఆమె ఎప్పుడో పెళ్లిపీటలెక్కేసిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. లాక్డౌన్ సమయంలో కూడా నయన్-విఘ్నేష్ చెన్నైలోని ఒకే అపార్ట్మెంట్లో సహజీవనం చేశారు. ఓనమ్ సందర్భంగా కేరళలోని తన ఇంటికి ప్రియుడిని తోడ్కోని వెళ్లింది నయనతార. అప్పటి నుంచే వీరి వివాహం గురించి అభిమానుల్లో ఆసక్తి ఎక్కువైంది.