బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా ఆ తర్వాత ‘నవయుగం’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాకే ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మీనా.. ‘సీతారామయ్య మనవరాలు’ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలతో జోడీ కట్టి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోని స్టార్ హీరోలందరితో మీనా జోడీ కట్టింది. నటిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ప్రముఖ వ్యాపరవేత్త విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప. అంతా హ్యపీగా సాగుతుందనుకున్న సమయంలో గతేడాది మీనా భర్త విద్యాసాగర్ చనిపోయాడు. భర్త మరణంతో మీనా డిప్రెషన్ లోకి వెళ్లింది.
ఇప్పుడిప్పుడు ఆ చేదు సంఘటన నుంచి బయటకు వస్తుంది. ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే మీనా ఓ బాలీవుడ్ హీరోను చాలా ఇష్టపడినట్లు తాజాగా ఒక ఇంటర్వూలో చెప్పింది. పెళ్లికి ముందు మీనాకు హృతిక్రోషన్ మీద క్రష్ ఉండేదని, అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని వాళ్ల అమ్మతో చెప్పినట్లు ఇంటర్వూలో వెల్లడించింది. అంతేకాకుండా హృతిక్ పెళ్ళి రోజున తన మనసు విరిగిపోయిందని చెప్పుకొచ్చింది.
గతేడాది మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’లో మీనా ఓ కీలకపాత్ర పోషించింది. ఇక మళ్లీ ఇప్పటివరకు మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం మీనా తమిళంతో పాటు మలయాళంలో రెండు సినిమాలు కమిట్ అయింది. ఇక మీనా కూతురు నైనిక కూడా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తుంది. విజయ్ హీరోగా నటించిన పోలీసోడు మూవీలో తన నటనతో అదరగొట్టింది.