Khushboo Sundar | సినీ నటి ఖుష్బూ సందర్ ఆస్పత్రి పాలయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఖుష్బూ సోషల్ మీడియాలో తెలిపింది. ‘వెన్నుముక సమస్యతో హాస్పిటల్లో చేరాను. రెండు రోజులు విశ్రాంతి అవసరం. కోలుకున్నాక విధుల్లో మళ్ళీ యథావిధిగా పాల్గొంటాను’ అని ట్వీట్ చేసింది. అంతేకాకుండా అభిమానులకు దసరా శుభాకాంక్షలను తెలిపింది. దాంతో నెటీజన్లు గెట్ వెల్ సూన్, టేక్ కేర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఖుష్బు సుందర్ సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఈమె శర్వానంద్ హీరోగా నటించిన ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలో రష్మిక తల్లిగా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె రెండు సినిమాల్లో నటిస్తుంది. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగాను పలు సినిమాలను రూపొందించి సక్సెస్ అయింది. ఇక ఈమె భర్త సుందర్.సి దర్శకత్వం వహించిన ‘కాఫీ విత్ కాదల్’ సినిమాను కూడా ఖుష్బూ నిర్మించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
Had a procedure for my coccyx bone yesterday. Back home now. Rest for 2 days n then back to work.
Sorry for the wishes, once again wishing you all #happydussehra2022 #HappyVijayadashami2022. pic.twitter.com/S8n1SjHEnS— KhushbuSundar (@khushsundar) October 5, 2022