Actress Aishwarya Lekshmi | సినీ తారలు ఒక్కోకరిగా సోషల్ మీడియాకు దూరమవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తాను సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనుష్క ప్రకటించిన కొద్ది గంటల్లోనే తాజాగా మరో నటి సోషల్ మీడియా నుంచి దూరం అవుతున్నట్లు తెలిపింది. తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి తాజాగా సోషల్ మీడియాకు పూర్తిగా దూరమవుతున్నట్లు ప్రకటించింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సోషల్ మీడియా తప్పనిసరి తాను మొదట్లో అనుకున్నానని.. కానీ కాలంతో పాటు మనము కూడా అప్డేట్ అవ్వాలన్న ఆలోచన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ఐశ్వర్య తెలిపింది. అంతేగాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. తాను సోషల్ మీడియాకు బానిసగా మారిపోయానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నటి తెలిపింది. ఈ సందర్భంగా ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.
నేను నా పని, పరిశోధనలపై దృష్టి పెట్టకుండా, సోషల్ మీడియా నా ఆలోచనలను దారి మళ్లించింది. సోషల్ మీడియా వలన నాలోని క్రియేటివిటీ పోయింది. నాలో నెగిటివిటీని పెంచడమే కాకుండా ఒక సర్కిల్లో లాక్ అయ్యేలా చేసింది. నాకు నేను ఏదో ఒక సూపర్ నెట్గా మారిపోవడం నాకు ఇష్టం లేదు. ఒక మహిళగా, నేను చాలా కష్టపడి నన్ను నేను మెరుగుపరుచుకున్నాను, కానీ సోషల్ మీడియాకి లొంగిపోవడానికి నేను ఇష్టపడలేదు.
ప్రపంచం నన్ను మర్చిపోతుందనే రిస్క్కు నేను సిద్ధంగా ఉన్నాను. నాలోని కళాకారిణిని, నాలో ఉన్న చిన్న పాపని కాపాడుకోవడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఇంటర్నెట్ నుండి పూర్తిగా అదృశ్యమవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో మరింత అర్థవంతమైన బంధాలను, మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. నేను నిజంగా మంచి సినిమా చేస్తే, మీరు పాత తరహాలోనే ప్రేమను పంచుతారని ఆశిస్తున్నానంటూ ఐశ్వర్య రాసుకోచ్చింది.
Actress Aishwarya Lekshmi quit social media! pic.twitter.com/eHoJ11LQc2
— MalayalamReview (@MalayalamReview) September 13, 2025