న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు యూసుఫ్ హుస్సేన్ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 73 ఏళ్లు. ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన మృతిచెందినట్లు సినీ నిర్మాత హన్సనల్ మెహతా తెలిపారు. నిర్మాత హన్సల్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో భావోద్వేగ సందేశాన్ని వినిపించారు. తండ్రి తరహాలో తనను ఎంతో ఆదుకున్నట్లు హన్సల్ తన పోస్టులో వెల్లడించారు. రాజ్కుమార్ రావుతో తీసిన షాహిద్ చిత్ర నిర్మాణ సమయంలో యూసుఫ్ తనకు అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. యూసుఫ్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు. కుచ్ నా కహో చిత్రంలో అభిషేక్తో కలిసి హుస్సేన్ నటించారు. ధూమ్ 2, రాయిస్, రోడ్ టు సంగమ్ లాంటి మేటి చిత్రాల్లో యూసుఫ్ హుస్సేన్ నటించారు.