తమిళ హీరో విశాల్కు టాలీవుడ్లోనూ మంచి మార్కెట్ ఉంది. ఈయన సినిమాలు ఇక్కడ కూడా మంచి కలెక్షన్లను సాధిస్తుంటాయి. అయితే గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. అభిమన్యుడు తర్వాత ఇప్పటి వరకు ఈయనకు ఒక్క హిట్టు కూడా లేదు. ప్రస్తుతం విశాలు మూడు సినిమాలను సెట్స్పైన ఉంచాడు. అందులో ఒకటి రిలీజ్కు సిద్ధంగా ఉండగా, రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇందులో మరో విశేషం ఏంటంటే డిటెక్టీవ్ సినిమాకు స్వయంగా ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన విజయ్-లోకేష్ సినిమాలో నటించకపోవడానికి కారణం ఏంటో తెలిపాడు.
విజయ్-లోకేష్ సినిమాలో విశాల్ను ఓ కీలకపాత్ర కోసం సంప్రదించగా, డేట్స్ సెట్ కాకపోవడంతో ఆ సినిమాలో చేయలేకపోతున్నాను అంటూ తెలిపాడు. అంతేకాకుండా త్వరలోనే విజయ్తో సినిమా తీస్తానని వెల్లడించాడు. విజయ్కు కథ చెప్పి, ఆయన సినిమాకు డైరెక్షన్ చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం కోలీవుడ్లో ఇది హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం విశాల్ నటించిన లాఠి రిలీజ్కు సిద్ధంగా ఉంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినమాలో ఎస్.జే సూర్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక విజయ్ ప్రస్తుతం ‘వారసుడు’ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్తో తన 67వ సినిమా చేయనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘విక్రమ్’ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.