తమిళ హీరో విజయ్ తెలుగు మూవీకి ముహూర్తం కుదిరింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్ సంయుక్త నిర్మాణంలో దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మాతలు. శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం బుధవారం చెన్నైలో జరిగింది. చిత్రబృందం అంతా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ప్లేలో భాగమయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ బుధవారం నుంచే మొదలయ్యింది. ఈ చిత్ర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.