Actress Trisha | ‘క్రిస్మస్ (Christmas) రోజున నా కుమారుడు చనిపోయాడు’ అంటూ ప్రముఖ నటి త్రిష (Actress Trisha) పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. త్రిష పెంపుడు శునకం జోరో (dog Zorro) ఇవాళ తెల్లవారుజామున మరణించింది.
గత 12 (2012 నుంచి) ఏళ్లుగా ఆ శునకం త్రిష వద్దే ఉంటోంది. దానికి జోరో అని ముద్దుగా పేరు పెట్టింది. దాన్ని కన్నబిడ్డలా చూసుకుంటోంది. దురదృష్టవశాత్తూ ఆ శునకం ఇవాళ తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. ఈ విచారకరమైన వార్తను త్రిష ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
— Trish (@trishtrashers) December 25, 2024
‘క్రిస్మస్ రోజు వేకువజామున నా కుమారుడు జోరో మరణించాడు. నా గురించి తెలిసిన వారికి తెలుసు జోరో లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానం అని. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాము. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పడుతుంది. సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నా. కొన్ని రోజుల వరకూ అందుబాటులో ఉండను’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఈ మేరకు జోరో ఫొటోలను కూడా పంచుకుంది. ప్రస్తుతం త్రిష పోస్ట్ వైరల్ అవుతోంది.
Zorro🪽
2012-2024🌈 pic.twitter.com/9JHOB3RFNp— Trish (@trishtrashers) December 25, 2024
Also Read..
Suriya 44 | నా కోపాన్ని కంట్రోల్ చేస్తే.. గూస్బంప్స్ తెప్పిస్తున్న సూర్య RETRO టైటిల్ టీజర్
Manchu Vishnu | అల్లు అర్జున్ వివాదం ఎఫెక్ట్.. మా సభ్యులకు కీలక సూచనలు చేసిన మంచు విష్ణు
Allu Aravind | శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం : అల్లు అరవింద్