Sharwanandh Wedding | టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ జూన్ 3న జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి రక్షిత రెడ్డిని శర్వానంద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు రామచరణ్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ సహా పలువురు సెలబ్రెటీలు వివాహ వేడుకకు హాజరై.. సందడి చేశారు. ఇక ఈ పెళ్లి వేడుకలో సిద్ధార్థ్ మరింత అట్రాక్షన్ గా నిలిచాడు. అంతేకాకుండా పెళ్లిలో లైవ్ కాన్సెర్ట్ జరుగుతుంటే స్టేజీ పైకి వెళ్లి పాట పాడి అతిథులను అలరించాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
కాన్సెర్ట్ జరుతుండగా సిద్ధార్థ్ వేగంగా స్టేజీ పైకి వెళ్లి పాట పడుతున్న సింగర్ చేతిలో నుంచి మైక్ తీసుకుని తన గాత్రంతో పాటను ఆలపించాడు. తాను నటించిన ఓయ్ సినిమాలోని ఓయ్ ఓయ్ అంటూ హూషారైన గీతాన్ని ఆలిపించి అక్కడున్న వారిని అలరించాడు. ఇక ఈ పాటను సినిమాలో కూడా తనే స్వయంగా ఆలపించాడు. ఇక శర్వానంద్-సిద్ధార్థ్ కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. ఈ సినిమాతోనే వీళ్లద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. పలు సందర్భాల్లోనూ ఒకరంటే ఒకరికి చాలా అభిమానం అని కూడా ఈ దోస్తులు చెప్పుకొచ్చారు. ఇక ఈ వేడుకు అదితిరావు హైదరీ కూడా వచ్చింది. సిద్దార్థ్-అదితిరావు ఈ వేడుకలో సందడి చేసి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.
Siddharth singing Oye Oye in Sharwanand Wedding👌🏻 pic.twitter.com/ZBzeacu1io
— Johnnie Walker (@roopezh) June 6, 2023