Robinhood Movie | టాలీవుడ్ నటుడు నితిన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఆలయంకు చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నితిన్కు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం రాబిన్హుడ్. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ నితిన్ స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. రాబిన్ హుడ్ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. శ్రీలీల కథానాయికగా నటించగా.. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రల్లో నటించారు.