Gopichand Remuneration | టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. గత కొంత కాలంగా ఫ్లాప్లతో సతమతమవుతున్న గోపిచంద్కు ‘సీటిమార్’ కాస్త ఊరటనిచ్చింది. కమర్షియల్గా ఈ చిత్రం గోపిచంద్ మార్కెట్ను పెంచింది. ప్రస్తుతం ఈయన నటించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను మొదలు పెట్టింది. ఇక ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాజాగా గోపిచంద్ ఓ ఇంటర్వూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో యాంకర్ తొలి సంపాదన గురించి అడిగింది. బదులుగా గోపిచంద్ ‘జయం’ చిత్రానికి పదకొండు వేల రూపాయిలు అందుకున్నానని తెలిపాడు. తేజ గారికి 11 లక్కి నెంబర్ అని అందుకే 11,000 రూపాయిలు ఇచ్చాడని పేర్కొన్నాడు. అప్పటికే గోపిచంద్ హీరోగా సినిమా చేశాడు. అయిన అంత తక్కువ పారితోషికం ఇవ్వడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు.