అలనాటి మహానటుడు ‘రక్తకన్నీరు’ నాగభూషణం మనవడు అబిద్భూషణ్ హీరోగా పరిచయం అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్’. ‘బిగ్బాస్’ఫేం రోహిత్ సహాని కథానాయిక. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో ఉషా, శివాని కలిసి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని దర్శకుడు మహి తెలిపారు. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించామని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు నిర్మిస్తామని నిర్మాతలు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. రియా కపూర్, మేఘనా రాజపుత్, బలరాజ్ వాడి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి కెమెరా, ఎడిటింగ్: పరవస్తు దేవేంద్ర సూరి.