సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడుతూ వస్తుంది. ఆచార్య బ్యాలెన్స్ షూట్ వర్క్ ఇంకా కేవలం 12 రోజులు మాత్రమే ఉండగా, ఈ పార్ట్ షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తారా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా పరిస్థితులు కొంత మెరుగుపడుతున్న నేపథ్యంలో జూలై నుండి మూవీ చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్టు సమాచారం.
రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. రెజీనా స్పెషల్ సాంగ్లో ఆడిపాడనున్నట్టు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.