చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. రామ్చరణ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల వాయిదా పడబోతున్నట్లు సోషల్మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, వాటిని నమ్మొద్దని నిర్మాతలు కోరారు. ‘ముందుగా ప్రకటించినట్లుగా ఫిబ్రవరి 4న చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. అందరి అంచనాల్ని అందుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో చిరంజీవి ఆచార్యుడిగా, నక్సలైట్గా భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారని చెబుతున్నారు. ఆచార్యకు అండదండగా నిలిచే సిద్ధ అనే శక్తివంతమైన పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందిస్తున్నారు. తిరుణ్ణావుక్కరుసు ఛాయాగ్రహణం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.