బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘త్రీ ఇడియట్స్’ విడుదలై 17ఏండ్లు అయింది. అయినా నేటికీ ఇది మరపురాని చిత్రమే. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమీర్ఖాన్, మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ నటించిన ఈ చిత్రానికి ప్రత్యేకంగా అభిమానులున్నారు. 2009లో విడుదలై అప్పటివరకూ ఉన్న బాక్సాఫీస్ రికార్డుల్నింటినీ తిరగరాసిన చిత్రమిది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు రాజ్కుమార్ హిరానీ ఓ సందర్భంలో చెప్పారు. తాజాగా ఈ సీక్వెల్ గురించి చిత్ర కథానాయకుడు అమీర్ఖాన్ స్పందించారు.
‘రాజు (రాజ్కుమార్ హిరానీ) ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నారు. రీసెంట్గా కథ విన్నాను. అద్భుతంగా అనిపించింది. విభిన్నమైన పాయింట్తో ఈ సినిమా రానున్నది. ‘త్రీ ఇడియట్స్’ ముగింపు నుంచి పదేండ్ల తర్వాత మా పాత్రల జీవితాల్లో ఏం జరిగిందనే అంశం చుట్టూ ఈ కథ సాగుతుంది. ‘త్రీ ఇడియట్స్’లో ఉన్న కామెడీ ఈ సీక్వెల్లో కూడా ఉంటుంది. అయితే.. స్క్రీన్ప్లే విషయంలో కొంత పని మిగిలివుంది’ అని తెలిపారు అమీర్ఖాన్.