నటుడు సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ నటిస్తున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. శశికాంత్ దర్శకత్వంలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఆది కెరీర్లోనే వైవిధ్యంగా నిలిచే కథతో రూపొందుతున్న చిత్రమిది. మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
తప్పకుండా ఈ చిత్రం మా యూనిట్ అందరికి మంచి గుర్తింపునిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్గోపి, నర్రా శత్రు, బెనర్జీ, రేడియో మిర్చి హేమంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి.