Aadi Sai Kumar | శంబాల సినిమాతో మంచి హిట్టందుకున్నాడు ఆది సాయి కుమార్. యుగంధర్ ముని కూడా డైరెక్టర్గా సూపర్ బ్రేక్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించారు. ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని యుగంధర్ ముని సమర్పిస్తుండగా.. బృందా రవీందర్ డైరెక్టర్ చేస్తున్నారు.
వినూత్నమైన కథాంశంతో భయం, ఉత్కంఠ, అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇదివరకెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని అందించేందుకు రెడీ అయింది. తాజాగా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగితపు పూల మధ్యలో ముఖంపై రక్తపు మరకలతో ఉన్న ఆదిసాయికుమార్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఓ వైపు పువ్వులు, మరోవైపు ఆకులు,పాత స్టాంప్నుచూడొచ్చు. ఇవన్నీ గమనిస్తే ప్రేక్షకులను ఏదో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లబోతున్నట్టు అర్థమవుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. గూస్బంప్స్ తెప్పించే బీజీఎంతో ఎమోషన్స్ను హైలెట్ చేస్తూ ప్రేక్షకులను భిన్నమైన అనుభూతిని ఇస్తామని ఆదిసాయికుమార్ టీం చెబుతోంది.
కొన్ని కథలు తలుపు తట్టవు.. అవి నిశ్శబ్దంలో వికసిస్తాయి..శాశ్వతంగా వెంటాడతాయి.సౌందర్యం, రక్తం, చీకటితో అల్లుకున్న ఒక వెంటాడే గాథ అంటూ రిలీజ్ చేసిన తాజా లుక్ నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది.
Some stories don’t knock.
They bloom in silence… and haunt forever.A haunting tale wrapped in beauty, blood, and darkness︎
Presenting a new haunting cinematic experience☠️︎︎
Starring @iamaadisaikumar
Directed By @ibrunda1
Presented by @ugandharmuni
Produced by… pic.twitter.com/LBrOwL9UGa
— Telugu Film Producers Council (@tfpcin) May 12, 2026
బండి భగీరథ్పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు : అడ్వకేట్ లలితా రెడ్డి
KTR | విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం.. నీట్ రద్దుపై కేటీఆర్