సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ రూపొందించిన సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సక్సెస్మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ..‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన మా సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. మంచి సినిమా చేశావంటూ ప్రశంసలు వస్తున్నాయి. తండ్రీ కూతుళ్లు కలిసి చూడాల్సిన చిత్రమిది. సినిమా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది’ అన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ…‘వినోదాన్ని అందించడంతో పాటు ఓ మంచి విషయాన్ని చెప్పాలని రూపొ ందించిన సినిమా ఇది. మంచి ప్రయత్నమని చెబుతున్నారు’ అన్నారు. నాయిక కృతి శెట్టి మాట్లాడుతూ…‘నా కెరీర్లో ప్రత్యేకమైన చిత్రమిది. ఈ సినిమాలో బాగా నటించానని చెబుతున్నారు. ఇందులోని క్యారెక్టర్లతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను’ అని చెప్పింది.