చైతన్య రావ్, అలెగ్జాండర్ సాల్నికోవ్, ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎ జర్నీ టు కాశీ’. ఈ చిత్రాన్ని వారణాసి క్రియేషన్స్ పతాకంపై దొరడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మునికృష్ణ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు ముని కృష్ణ మాట్లాడుతూ…‘రోడ్ జర్నీ చిత్రమిది. ఇందులో కాశీ విశిష్టతను చూపిస్తున్నాం. కాశీ యాత్ర చేసిన వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అన్నారు.